మొక్కలు నాటడాన్ని ప్రతి పౌరుడు బాధ్యత స్వీకరించాలని మున్సిపల్ కౌన్సిలర్ దొంగరి మంగమ్మ అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో బుధవారం శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి జన్మదిన సందర్భంగా సందర్భంగా 5వ, వార్డులోని ప్రెస్ క్లబ్ కార్యాలయం వద్ద ఆమె మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా పలువురు ప్రజా ప్రతినిధులు మాట్లాడూతూ ముఖ్యమంత్రి పదవి చేపట్టినప్పటిన నాటి నుండి సిఎం కెసిఆర్ హరితహారం ద్వారా రాష్ట్రంలో పచ్చదనం పెంచేందుకు కృషి చేస్తున్నారని అన్నారు.ప్రతి సందర్భాన్ని మొక్కలు నాటడానికి ఉపయోగించికోవాలన్నారు. అనంతరం కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గెల్లి అర్చనా రవి, వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు,మాజీ మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్,కౌన్సిలర్లు అట్లూరి మంజుల హరిబాబు,చిలక బత్తిని సౌజన్య,యరగాని గురవయ్య,ఓరుగంటి నాగేశ్వరరావు,ములకలపల్లి రాంగోపి, అమరబోయిన గంగ రాజు,వీర్లపాటి గాయత్రి భాస్కర్,టిఆరెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు చిట్యాల అమర్ నాథ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ అమర్, టిఆరెస్ నాయకులు గాబుల శ్రీనివాస్, నారబోయిన నర్సింహారావు,శీలం సైదులు, వెంకటరాజు,నగేష్ రాథోడ్,రాచకొండ స్వప్న,మున్ను,మహిళా నాయకులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్