35.2 C
Hyderabad
April 24, 2024 12: 33 PM
Slider విజయనగరం

రాష్ట్ర స్థాయీ క‌బ‌డ్డీ పోటీల‌కు క్రీడాకారులు ఎంపిక‌…!

#Kabaddi

ఈ నెల 25 తేదీ నుంచీ మూడు రోజుల  పాటు విశాఖ జిల్లా చోడవరం మండలం అంకుపాలెంలో జరగనున్న రాష్ట్ర స్థాయీ  సీనియర్ క‌బ‌డ్డీ  పోటీలకు విజ‌య‌న‌గ‌రం జిల్లా నుంచీ సీనియర్ స్త్రీ,పురుష జట్లు ఎంపిక  స్థానిక రాజీవ్ స్టేడియంలో జరిగింది.

జిల్లా వ్యాప్తంగా వందల సంఖ్యలో క్రీడాకారులు హాజరయ్యారు. 12 మందితో కూడిన  స్త్రీ, పురుష జట్లను  ఎంపిక చేసారు.ఈ సంద‌ర్బంగా వైఎస్ఆర్సీపీ యువజన నేత‌ ఈశ్వర్ కౌశిక్ మాట్లాడుతూ కబ్బడ్డీ అంటే రాష్ట్రంలో విజయనగరానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉందన్నారు.

భగవాన్ దాసు  అందించిన స్పూర్తితో కబ్బడ్డీని జిల్లాలో అభివృద్ధి చేస్తున్నారని అదే స్ఫూర్తితో రాష్ట్ర పోటీలకు ఎంపికైన క్రీడాకారులు బాగా ఆడి జిల్లాకు గుర్తింపు తేవాలన్నారు.

ఎంపిక ప్రక్రియలో జిల్లా లా కబ్బడ్డీ అసోసియన్ ఉపాధ్యక్షులు కె. తవిటి రాజు ,కార్యదర్శి కాళ్ల.సూరిబాబు,ఆర్గనైజింగ్ కార్యదర్శి పి.శ్రీనివాసరావు,  చీప్ కోచ్ వెంకటేశ్వరరావు, సీనియర్ వ్యాయమ ఉపాధ్యాయులు బి.రామారావు, చిన్నంనాయుడు, జిల్లా వ్యాయమ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు సన్యాసినాయుడు,ఎస్ జి ఎఫ్ కార్యదర్శి ఎల్ వి.రమణ,వ్యాయమ ఉపాధ్యాయులు, జిల్లా వ్యాప్తంగా వచ్చిన క్రీడా కారులు పాల్గొన్నారు.

Related posts

గిరిజన బిడ్డ పోరాటానికి దిగివచ్చిన ప్రభుత్వం..

Satyam NEWS

పర్యావరణానికి పెద్ద పీట: ‘ప్రాజెక్ట్ చీతా’

Satyam NEWS

మన రాజ్యాంగాన్ని పౌరులు అందరు గౌరవించాలి

Satyam NEWS

Leave a Comment