శ్రీకాకుళం పట్టణం లోని ఆర్. అండ్ .బి. గ్రౌండ్ ను మినీ స్టేడియం గా మార్చ వలసినదిగా క్రీడాకారులు, వాకర్స్, పట్టణ వాసులు కోరుతున్నారు. పాత శ్రీకాకుళం క్రీడాకారులు, వాకర్స్ కోడి రామ్మూర్తి స్టేడియం వెళ్లాలన్నా, ప్రభుత్వ కళాశాల గ్రౌండ్ వెళ్లాలన్నా సుమారుగా 5 కిలోమీటర్లు దూరం వెళ్లాల్సి వస్తున్నది.
ఈ అసౌకర్యాన్ని తొలగించాలంటే ఆర్. అండ్ .బి. గ్రౌండ్ ను మినీ స్టేడియం గా మార్చాలని పేద, బడుగు బలహీన వర్గాల క్రీడాకారులు కోరుతున్నారు. ఆర్. అండ్ .బి. గ్రౌండ్ ను మినీ స్టేడియం గా మార్చడం వల్ల మరికొంతమంది నూతన క్రీడాకారులు తయారవడానికి అవకాశం ఉంది.
అదేవిధంగా ఉన్న డచ్ వారి భవనం కు మరమ్మతులు చేస్తే ఇటు క్రీడాకారులకు, రాజకీయ నాయకులకు కూడా సౌకర్యవంతంగా ఉంటుంది. ఆర్. అండ్ .బి. గ్రౌండ్ ను మినీ స్టేడియం మార్చడానికి కేవలం 20 లక్షలు మాత్రమే సరిపోతుంది. జిల్లా కలెక్టర్ జె.నివాస్ దీనిపై దృష్టి సారించి వలసిందిగా స్థానికులు కోరుతున్నారు.