తన పుట్టిన రోజు సందర్భంగా నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గ టీఆర్ ఎస్ పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలకు, అభిమానులకు ఏ విధమైన ప్రత్యేక ఏర్పాట్లు చేయవద్దని నకిరేకల్ నియోజకవర్గం శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య విజ్ఞప్తి చేశారు.
సోమవారం తన పుట్టిన రోజు అయినందున లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి తన నివాసం వరకూ రావద్దని ఆయన కోరారు. ఎటువంటి ఫ్లెక్సీలు,హంగు ఆర్భాటంగా సంబరాలు జరపవద్దని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు.
కరోనా వైరస్ నిర్ములనలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ను ప్రకటించినందున ఎవరూ కూడా ఇంట్లో నుండి బయటకు రావద్దని, స్వీయ నిర్బంధం పాటించి, కరోనాను తరిమికొట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అండగా ఉందామని ఆయన పిలుపునిచ్చారు.