తెలంగాణ రాష్ట్రంలో అంతటా లాక్డౌన్ ప్రకటించినప్పటికి,సూర్యాపేట జిల్లా లోని ప్రజలు చిన్న చితక పనులకు బయటకు వస్తున్నారు. అనవసరంగా బయట తిరుగుతున్న వాళ్ళను పోలీస్ లు పట్టుకొని జరిమానాలు విధిస్తున్నారు. అయినప్పటికీ ప్రజలలో ఎలాంటి మార్పు రాకపోవడం తో ,జిల్లా కేంద్రం లోని కోర్టు చౌరస్తా లో డ్యూటీ చేస్తున్న పోలీస్ కానిస్టేబుల్, బైక్ పై వెళ్తున్న వాళ్ళ దగ్గరకు వెళ్లి అనవసరంగా బయటకు రాకండి అంటూ చేతులు ఎత్తి దండం పెట్టాడు.మేము మా కుటుంబ సభ్యులకు దూరమై మీ కోసమే ఇలా రోడ్ల మీదకు వచ్చి డ్యూటీ లు చేస్తున్నాం, దయచేసి ఎవరు కూడా బయటకు రాకండి అంటూ ప్రాధేయపడ్డాడు.
previous post