30.7 C
Hyderabad
April 19, 2024 07: 27 AM
Slider శ్రీకాకుళం

జీతాల చెల్లింపు ప్రక్రియ వేగవంతం చేయాలి

#deo

రాష్ట్ర భాషో పాధ్యాయ సంస్థ శ్రీకాకుళం జిల్లా శాఖ డీఈఓ కు వినతి

45 నెలలుగా జీతాలు లేక తీవ్ర ఆందోళనలో కొట్టుమిట్టాడుతున్న డీఎస్సే 2002 హిందీ భాషా పండితులకు జీతాల చెల్లింపు ప్రక్రియ వేగవంతం చేయాలని రాష్ట్ర భాషో పాధ్యాయ సంస్థ జిల్లా అధ్యక్షుడు పిసిని వసంతరావు, సహధ్యక్షుడు కుప్పన్నగారి శ్రీనివాసరావులు డీఈవో గార పగడాలమ్మ ను కోరారు. ఈ మేరకు వారు ఆమెకు వినతి పత్రాన్ని అందించారు. సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న జీతాల సమస్యకు పరిష్కారంగా విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జీతాల చెల్లింపునకు ఇచ్చిన ఉత్తర్వులను గుర్తు చేశారు. ఇప్పటికే చాలా ఆలస్యం అయినందున తక్షణం చర్యలు చేపట్టాలని వారు కోరారు. సంబంధిత డ్రాయింగ్ అధికారుల ద్వారా భాషా పండితుల ట్రెజరీ ఐడి నెంబర్లు కొరకు ప్రతిపాదనలు పంపించేలా ఆదేశాలు ఇవ్వాలని వారు కోరారు.

Related posts

క‌రోనా వ్యాధిని అరిక‌ట్టేందుకు అన్నివిధాలా స‌హ‌కారం

Satyam NEWS

కరోనా వేళ కార్పొరేట్  సంస్థ‌లు ముందుకు రావాలి

Satyam NEWS

డిస్మిస్ నిర్ణయంపై న్యాయపోరాటానికి ఏబీ వెంకటేశ్వరరావు సిద్ధం

Satyam NEWS

Leave a Comment