హైదరాబాద్ నడిబొడ్డున్న ఉన్న బతుకమ్మ కుంట స్మశాన వాటిక స్థలాన్ని కబ్జాదారుల నుంచి కాపాడాలని సామాజిక కార్యకర్త కె. వెంకటనారాయణ కోరారు ఈ మేరకు ఆయన హైదరాబాద్ ఆర్డిఓ కు వినతి పత్రం అందజేశారు. బతుకమ్మ కుంట సబ్ స్టేషన్ పక్కన ఉన్నది స్మశాన వాటిక స్థలం అని ఆయన తెలిపారు. ప్రభుత్వానికి చెందిన ఈ స్థలం ప్రస్తుతం కొంతమంది వ్యక్తుల చేతిలోకి పోయిందని ఆయన అన్నారు. స్మశానంలో ఉన్న బొందలని పూర్తిగా నేలమట్టం చేసి వైన్ షాప్ ని నెలకొల్పారని సామాజిక కార్యకర్త కె. వెంకటనారాయణ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సర్వే నెంబర్: 570/2 స్మశానం స్థలం 2 గుంటలు గ్రామం: అంబర్పేట్ సర్ఫాకాస్ కాత నెంబర్: 197 అంబర్పేట్ అర్బన్ పహాణి: 1973 ఈ స్థలము కోట్ల రూపాయలు విలువచేసేదని ఆయన తెలిపారు. తహసీల్దార్ ఈ స్థలాన్ని అధీన పరచుకొని ప్రభుత్వం బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ స్థలంలో మంచినిటి బోర్ వేశారని ఇది అధికారుల అనుమతితో వేసారా లేక అనుమతి లేకుండా వేసారా అని ఆయన ప్రశ్నించారు. వెంటనే రెవిన్యూ యాక్ట్ ద్వారా కేసులు నమోదు చేయాలని అలాగే హిందూ స్మశాన వాటిక కబ్జాలు చేసిన వారిపై హిందూ యాక్ట్ కేసులు నమోదు చేయాలన్నారు.
సత్యం న్యూస్, అంబర్పేట