37.2 C
Hyderabad
March 28, 2024 19: 30 PM
Slider పశ్చిమగోదావరి

అయ్యా కొప్పుల వెంకట్రామయ్యను కాపాడండి

#covidpatient

ఏ పి నుండి కోవిడ్ పేషేంట్ తెలంగాణాలో మెరుగైన ట్రీట్ మెంట్ కోసం అంబులెన్స్ లో వెళుతుండగా తెలంగాణా పోలీసులు తెలంగాణా సరిహద్దులలో ఆపివేసినట్టు సమాచారం.

వివరాలలోకేళితే పశ్చిమ గోదావరిజిల్లా పెడవేగి మండలం రామసింగవరం గ్రామానికి చెందిన కొప్పుల వెంకట్రామయ్య అనే వ్యక్తి కోవిడ్ బారిన పడ్డాడు. తెలంగాణాలో మెరుగైన చికిత్స కోసం అక్కడ ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో బెడ్ రిజర్వేషన్ చేయించుకున్నారు.

వైద్యం కోసం తెలంగాణాకు అంబులెన్స్ లో వెళుతుండగా సూర్యా పేట జిల్లా రామాపురం చెక్ పోస్ట్ వద్ద అక్కడి పోలీసులు అంబులెన్స్ ను నిలిపి వేయడం తో  కోవిడ్ పేషేంట్ కొప్పుల వెంకట్రామయ్య బంధువులు, రామసింగవరం గ్రామస్తులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

దీ నిపై ఏ పి ప్రభుత్వం తో పాటు పశ్చిమ గోదావరిజిల్లా కలెక్టర్ కూడా వెంటనే స్పందించి పేషేంట్ వెంకట్రామయ్య కు తెలంగాణా లో మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని రామసింగవరం గ్రామ ప్రజలు కోరుతున్నారు.

Related posts

బురద రాజకీయాల్లో కూరుకుపోతున్న విలువలు

Satyam NEWS

భారత్ తో చర్చలకు పాకిస్తాన్ సిద్ధం

Satyam NEWS

తల్లి ప్రేమ చాటుకున్న వరాహం: కుక్కపిల్లకు పాలిచ్చిన పంది

Satyam NEWS

Leave a Comment