కాకతాళీయమో కావాలని చేశారో కానీ ప్రధాని మోడీ కరోనా పై పోరాటంలో ఇచ్చిన మరో పిలుపు తొమ్మిది అంకె చుట్టూనే తిరుగుతూ ఉంది. ఈ నెల 5వ తేదీ రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు దీపాలు వెలిగించమని నేడు ప్రధాని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
ఈ నిర్ణయంపై ఎటు నుంచి చూసినా 9 అంకెతో ముడిపడి ఉన్న అంశాలే కనిపిస్తున్నాయి. ఈ అంశం ఇప్పుడు అందరిలో ఆసక్తి రేకెత్తిస్తున్నది. ఇప్పటికే కొందరు జ్యోతిష్కులు తమ తమ పాండిత్యాన్ని ప్రదర్శించారు. ఇప్పుడు సంఖ్యా శాస్త్రం ప్రకారం కూడా కొందరు కొత్త భష్యం చెబుతున్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ నేడు సరిగ్గా ఉదయం 9 గంటలకు ఈ పిలుపునిచ్చారు. ఆయన ప్రసంగం సరిగ్గా 9 నిమిషాల పాటు మాత్రమే సాగింది. దీపాలు వెలిగించాల్సిన రోజు- నాలుగో నెల (ఏప్రిల్) ఐదవ తారీకు అంటే ఇది కూడా తొమ్మిదే. రాత్రి 9 గంటలకు, 9 నిమిషాల పాటు దీపం వెలిగించండి అని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. నేడు దేశ వ్యాప్త లాక్ డౌన్ ప్రకటించి 9వ రోజు. ఏప్రిల్ 5 నాటికి మరో 9 రోజుల లాక్ డౌన్ పిరియడ్ మిగిలి ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మార్స్ (మంగళ గ్రహం) కు చెందిన సంఖ్య 9. అగ్ని, కాంతి కలిస్తే మార్స్. అందుకే నేమో ఆ గ్రహానికి సంబంధించిన శక్తిని ఆహ్వానించేందుకు నరేంద్రమోడీ ఈ ప్రయోగం చేస్తున్నారేమో.