దేశ ప్రజలకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇస్తామని భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించడం పట్ల రాజన్న సిరిసిల్లా జిల్లా బిజెపి నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
బీజేపీ ఎస్సీ మోర్చా అధ్వర్యంలో వేములవాడ అంబేడ్కర్ నగర్ లో ప్రధాని నరేంద్ర మోడీ చిత్ర పటానికి పాలభిషేకం చేశారు.
దేశం మొత్తం అన్ని రాష్ట్రాలకు ఉచితంగా వ్యాక్సిన్లు అందిస్తున్నట్లు ప్రకటించడం ప్రధాని నరేంద్ర మోడీ సాహసోపేత నిర్ణయమని వారు తెలిపారు.
అదే విధంగా దేశంలోని నిరుపేదలు కరోనా లాక్ డౌన్ కారణంగా ఇబ్బంది పడకుండా నవంబర్ వరకు ఉచిత రేషన్ ఇవ్వడం ఎంతో మంచి నిర్ణయమని బీజేపీ రాష్ట్ర దళిత మోర్చా ప్రధాన కార్యదర్శి కుమ్మరి శంకర్ అన్నారు.
కార్యక్రమం లో పోతరం సాయి, హర్షక్, అక్కి గోపాల్, కుమ్మరి మారయ్య, పెంట రాజేశం, ఎదురుగట్ల రాజేశం, బూమయ్య, అనివేష్ దేవయ్య, కుమ్మరి పర్శరం తది తరులు పాల్గొన్నారు.