ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రామగుండం పర్యటనకు వస్తున్న నేపథ్యంలో సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని సిపిఐ పార్టీ కార్యాలయం ఎదుట నల్ల జండాలతో నిరసన తెలియజేశారు.
ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు పాలకూరి బాబు మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన నాటినుండి ప్రజా వ్యతిరేక విధానాలు, పెట్రోల్,డీజిల్,వంటగ్యాస్ ధరలు పెంచడం, జిఎస్టి విధించటం,ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేయటం జరుగుతుందని అన్నారు. రామగుండంలో ప్రారంభిస్తున్న ఎరువుల కర్మాగారం ప్రారంభించి దానిని కూడా ప్రైవేట్ పరం చేయరనే నమ్మకం ఏమిటని పాలకూరి బాబు ప్రశ్నించారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మటం ద్వారా వచ్చిన డబ్బుతో ప్రభుత్వాలను కూల్చడం, ఈడి దాడులు చేస్తున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యుడు యల్లావుల రమేష్,ఏఐటియుసి అధ్యక్షుడు ఇందిరాల వెంకటేశ్వర్లు,సిపిఐ పట్టణ సహాయక కార్యదర్శి జక్కుల రమేష్,కార్యవర్గ సభ్యులు జక్కుల శ్రీను, యల్లావుల ఉమా,వెంకన్న,రమణ, వెంకటేశ్వర్లు,చక్రాల వెంకటేశ్వర్లు, మంగయ్య తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ హుజూర్ నగర్