భారత మాజీ ప్రధాని పి.వి.నరసింహ్మారావు జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా హైదరాబాద్ పాతనగర కవుల వేదిక, లాల్ దర్వాజ ఆధ్యర్యంలో ఒక కవితా సంకలనాన్ని డిసెంబర్ లో ఆవిష్కరించదలచినట్లు కన్వీనర్ కె.హరినాథ్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయనపై కవితలను ఆహ్వానిస్తున్నట్లు హరినాథ్ తెలిపారు. కవితలు 20 లైన్లకు మించకుండా వుండాలి. ఈ కవిత నా స్వంతమే, ఎక్కడ ప్రచురణకాని, ప్రసారంకాని కాలేదని హామీనిస్తూ, 5వ సెప్టెంబరు 2020 లోగా, 9703542598 కు గాని 9182178653 కి గాని వాట్స్ యాప్ కి పంపాలని ఆయన కోరారు.
ఎన్నికైన కవితల్లో ఉత్తమ ప్రథమ కవితకి 3,116/- లు, ద్వితీయ కవితకి 2,116/-లు, తృతీయ కవితకి 1,116/-లు గా, ఇవే కాకుండా మరో పది కవితలకు కన్సొలేషన్ బహుమతులు ఇస్తున్నట్లు హరినాథ్ తెలిపారు.
ఈ సంకలనం, బహుమతులను డిసెంబర్ లో జరిగే పి వి నరసింహారావు వర్ధంతి సందర్భంగా ఇస్తారు. ఇతర వివరాలకు పై నంబర్సుతో సంప్రదించగలరు.