శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఏప్రిల్ 9 వ తేదీ వరకు ఖమ్మం కమిషనరేట్ పరిధిలో 30 పోలీస్ యాక్ట్ అమలులో వుంటుందని పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ ఓ ప్రకటనలో తెలిపారు. ఆంక్షలు అమలుల్లో వున్నందున అనుమతి లేకుండా ఎలాంటి సభలు, ర్యాలీలకు, సమావేశాలు నిర్వహించరాదని తెలిపారు.
గుంపులుగా తిరగటం నిషేధం వున్న నేపథ్యంలో వివిధ వర్గాల ప్రజలు, రాజకీయ పార్టీలు, వివిధ సంఘాల నాయకులు పోలీసులకు సహకరించాలని కోరారు. ఖమ్మం పోలీస్ కమీషనరేట్ లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా 30 పోలీసు యాక్ట్ ఏప్రిల్ 9 వరకు అమలులో వుంటుందని పోలీస్ కమీషనర్ తెలిపారు.
30 పోలీసు యాక్ట్ అంటే…..
పోలీసు వారి అనుమతి లేకుండా ఎటువంటి ర్యాలీలు, ఊరేగింపులు, సభలు, సమావేశాలు జరుపరాదు.
అనుమతి లేనిదే మైకులు, సౌండ్ బాక్సులు వినియోగించరాదు.
మారణాయుధాలతో తిరగడాన్ని, ప్రమాదకర పనిముట్లను దురుద్దేశముతో వెంట ఉంచుకోవడాన్ని తీవ్రంగా పరిగణించబడుతుంది.
రోడ్లపై, కాలనీలు, ఇతర ప్రజా సంబంధ, బహిరంగ ప్రదేశాలలో గుంపులుగా గుమిగూడరాదు.
వ్యక్తులుగా, సామాజిక మాధ్యమాలలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం, శాంతిభద్రతల పరిస్థితులకు భంగం కలిగించడం వంటి చర్యలపై పోలీసు అత్యంత కఠినంగా వ్యవహరిస్తుంది.
ప్రజలను భయబ్రాంతులకు గురి చేసే వ్యక్తులపై కఠిన చట్టాలతో కేసులు నమోదు చేయబడును.