రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు తొలి విడత నామినేషన్ల పర్వం షురూ అయ్యింది.ఈ క్రమంలో విజయనగరం జిల్లాలో కూడా నామినేషన్ల తొలి ఘట్టం ముగిసింది.
ఇప్పటికే సమస్యాత్మక గ్రామాలను గుర్తించిన జిల్లా ఎస్పీ రాజకుమారీ… ఆయా ప్రాంతాల్లో సిబ్బంది ని కూడా నియమించారు. ఈ క్రమంలో ఆయా పోలీసు స్టేషన్ల సిబ్బంది.. స్థానికులతో సమావేశమై…ఎన్నికల గురించి అవగాహన కల్పించారు.
మద్యం, జూదం ,డబ్బులు పంపిణీ వాటికి ప్రలోభపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.అతి సమస్యాత్మక గ్రామాల్లో డీఎస్పీ, సీఐ మరియు ఎస్ఐ స్థాయి అధికారులు ఆయా గ్రామాలను సందర్శించి ఎన్నికల ప్రవర్తనా నియమావళి గురించి ప్రజలకు వివరించారు.
శాంతియుతంగా ఎన్నికల నిర్వహణకు సహకరించాలని, ఎటువంటి ఘర్షణలు పాల్పడ వద్దని, ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు సహకరించాలని సూచించారు. అల్లర్లకు పాల్పడితే చట్ట పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.