మీరు కరెక్టే చదివారు. పాల్వంచ పోలీసులు అరెస్టు చేసింది పందెం కోళ్లనే. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ రూరల్ పోలీస్ స్టేషన్లో నాలుగు రోజులుగా పందెం కోళ్లకు ఠాణాలో పోలీసులు భద్రత కల్పిస్తున్నారు….ఇది నిజమండి…వాటికి ఆ ఠాణాలో పనిచేసే సిబ్బంది రేషన్ బియ్యాన్ని ఆ పందెం కళ్ళకు ఆహారంగా అందిస్తూ వారికి పహరా కాస్తున్నారు…భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ మండలం దంతలబోరు శివారు అటవీ ప్రాంతంలో కోడి పందేలు నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు పాల్వంచ రూరల్ ఎస్సై సుమన్ ఆధ్వర్యంలో ఈనెల 25న పందెం కోళ్ళ స్థావరంపై దాడి చేశారు.
ఈ సందర్భంగా మూడు పందెం కోళ్లతో పాటు ఐదుగురిని అరెస్టు చేశారు. అనంతరం ఆ పందెం రాయుళ్ళకు పోలీసులు నోటీసులు జారీ ఇచ్చి పంపిచేశారు….కానీ పోలీసులు మాత్రం ఆ పందెం కోడిపుంజులను నేటికి విడుదల చేయలేదు. కిన్నెరసాని రూరల్ పోలీసు స్టేషన్ ప్రాంగణంలోనే కోడిపుంజులను బంధించారు. పుంజుల రంగుల ఆధారంగా. ఎఫ్ఐఆర్ నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తామని, తదుపరి ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు….