27.7 C
Hyderabad
March 29, 2024 04: 50 AM
Slider ప్రకాశం

కొట్టిందే పోలీసులు… ఇంకెవరికి ఫిర్యాదు చేయాలి???

#police attack

పాత కక్షలతో దాడి చేయడంతో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు….. ఇలా జరిగినప్పుడు ఏం చేయాలి? వెంటనే వెళ్లి పోలీసులకు చెప్పాలి.

అప్పుడు వారు కేసు నమోదు చేసి కేసు దర్యాప్తు చేసి నిందితుల్ని పట్టుకుని కేసు కోర్టులో ప్రవేశపెడతారు. అంతే కదా. అయితే కొట్టిందే పోలీసులు అయితే ఏం చేయాలి?

ఏం చేయాలో అర్ధం కాని ఒక వ్యక్తి బాధపడుతూ ఇంట్లో కూర్చున్నాడు. ప్రకాశం జిల్లా చిన్నగంజాం మండలం సంతరావూరు గ్రామానికి చెందిన సునీల్ అనే వ్యక్తి ని పాత కక్షల నేపథ్యంలో ముగ్గురు కానిస్టేబుల్స్ దాడిచేసి గాయపరిచారు.

సంతరావూరుకు చెందిన సాదు సునీల్ మంగళవారం తన పని చూసుకొని ఊర్లోకి వస్తుండగా అదే గ్రామానికి చెందిన పెరికల జాన్, పెరికల తాతయ్య, దేవ తోటి చిన్న, మార్పు బలరాం అనే వ్యక్తులు  అతన్ని ఆపి కర్రలతో అతని పైకి దాడి చేశారు.

ఇలా దాడి చేసిన వారిలో ముగ్గురు పోలీసులు ఉన్నారు. వారు ఇష్టానుసారంగా కొట్టడంతో అతను ప్రాణభయంతో పారిపోయి ఇంట్లోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు.

అతని భార్య రక్తంతో ఉన్న భర్తని పర్చూరు ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకుని వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు.

అనంతరం చిన్నగంజాం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు ఇచ్చినప్పటికీ ఎవరూ ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

పైగా పోలీసు కానిస్టేబుల్స్ ఇంకా అతడిని బెదిరిస్తూనే ఉన్నారు. తనకు న్యాయం చేయాలని లేనిపక్షంలో జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ని కలిసి ఫిర్యాదు చేస్తామని బాధిత కుటుంబం అంటున్నది.

Related posts

వరిధాన్యం కొనుగోలుకు మార్కెట్ యార్డు చొరవ

Satyam NEWS

డాక్టర్ చదలవాడ ను పరామర్శించిన మాజీ మంత్రి కాసు

Bhavani

అంగన్వాడీ బడిలో ఆయుష్మాన్ భారత్

Satyam NEWS

Leave a Comment