ఓ ప్రార్థన మందిరంలో కొంతమంది తో ప్రార్ధనలు నిర్వహిస్తున్న పాస్టర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. కరోనా వ్యాధి విజృంభిస్తున్నా కూడా మత ప్రార్ధనలకే ప్రాధానతనిచ్చిన ఈ పాస్టర్ పై సమాచారం అందడంతోనే తూర్పుగోదావరి జిల్లా రాయవరం పోలీసులు సిబ్బందితో కలిసి దాడి చేశారు. ప్రార్ధనలు నిర్వహిస్తున్న పాస్టర్ ని అదుపులోకి తీసుకున్నారు.
వివరాల్లోకి వెళితే మండల కేంద్రమైన రాయవరం గ్రామంలో తుల్యభాగ నది వద్ద ఉన్న ప్రభువైన యేసు క్రీస్తు ప్రార్థన మందిరం లో ఉదయం 150 తో ప్రార్థన నిర్వహిస్తుండగా స్థానికులు ఇచ్చిన సమాచారం పై రాయవరం ఎస్సై ఎల్ శ్రీను నాయక్ అక్కడికి వెళ్లి అక్కడ ఉన్న వారిని ఇండ్లకు పంపించి, పాస్టర్ నాతి విజయ రత్నం పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.