28.7 C
Hyderabad
April 20, 2024 03: 31 AM
Slider ఖమ్మం

అక్రమ కేసులతో ఉద్యమాలను ఆపలేరు

#CPIKhammam

సిపిఎం పార్టీ జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి, ప్రముఖ ఆర్థిక వేత్త జయతి ఘోష్ లపై అక్రమంగా కేసులు బనాయించినందురకు నిరసనగా ఖమ్మం జిల్లా కొణిజర్ల సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో తనికెళ్ల లో నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు భూక్య వీరభద్రం కొణిజర్ల సిపిఎం పార్టీ మండల కార్యదర్శి తాళ్లపల్లి కృష్ణ లు మాట్లాడుతూ ఢిల్లీలో జరిగిన అల్లర్ల కు పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర పట్టిక లకు నిరసనగా దేశవ్యాప్తంగా కొనసాగిన ఆందోళనలు కారణమని దాన్లో పాల్గొన్న నాయకులు విద్యావేత్తలు పై కేసు పెట్టడం చాలా హేయమైన చర్య అని అన్నారు.

వారిపై పెట్టిన కేసులు వెంటనే విరమించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో  తనికెళ్ళ శాఖ కార్యదర్శి అన్నారపు వెంకటేశ్వర్లు,యాస తిలక్, చల్లా నారాయణ,యాస కృష్ణయ్య,యాస వెంకటేశ్వర్లు,అనుమోలు రామారావు తదితరులు పాల్గొన్నారు

Related posts

రైతుల పంట రుణాలను రద్దు చేయాలి

Satyam NEWS

కొత్త జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వ ఉద్యోగుల హెచ్ఆర్ఏ పెంపు

Bhavani

నేడు పీఎం డిజిటల్‌ హెల్త్‌ మిషన్‌ స్కీమ్‌ ప్రారంభించనున్న మోడీ

Sub Editor

Leave a Comment