బాలివుడ్ నటుడు ఇటీవల ఆత్మహత్య చేసుకున్న సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసు కొత్త మలుపు తిరిగింది. సుశాంత్ తండ్రి రియా చక్రవర్తి అనే హీరోయిన్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడానికి రియా చక్రవర్తి కారణమని ఆయన ఆరోపించాడు.
పాట్నాలో ఉండే సుశాంత్ తండ్రి చేసిన ఆరోపణల ప్రకారం రియా చక్రవర్తి అతడిని మానసికంగా వేధించింది. అతని వద్ద ఉన్న డబ్బు అంతా వాడుకున్నది. ఈ కారణాలవల్లే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడు. రియా చక్రవర్తితో బాటు ఆమె కుటుంబ సభ్యులను కూడా చేరుస్తూ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నెల రోజుల కిందట సుశాంత్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.
సుశాంత్ మరణంపై సిబిఐ విచారణ జరిపించాలని ఇటీవలె రియా చక్రవర్తి ట్విట్టర్ లో కోరింది. ఈ మేరకు ఆమె హోం మంత్రి అమిత్ షాను కూడా కోరింది. సుశాంత్ మరణం తర్వాత తనకు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని కూడా రియా చెప్పింది. తాను సుశాంత్ ప్రేమించుకున్న విషయాన్ని కూడా ఆమె తన ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.