చెన్నేకొత్తపల్లి పోలీస్ స్టేషన్ లో పరిటాల శ్రీరామ్ పై కేసు నమైంది. నిన్నటి రోజు చెన్నేకొత్తపల్లి మండలం ముష్టికోవెల గ్రామంలో టిడిపి కార్యకర్తల కుటుంబలను పరామర్శించడానికి శ్రీరామ్ వెళ్లారు.
అయితే పరిటాల శ్రీరామ్ గ్రామంలోకి రాగానే ఆ పార్టీ శ్రేణులు వైసిపికి సంబంధించిన కార్యకర్త బత్తిని వెంకట్రాముడు అక్కడ ఉన్నపుడు తనపై టీడీపీ కార్యకర్తలు దుర్భాషలాడుతూ చేయి చేసుకున్నారని పరిటాల శ్రీరామ్ తో పాటు మరో తొమ్మిది మందిపై పోలీస్ స్టేషన్ నందు 324 కేసు పరిటాల శ్రీరామ్ నమోదు చేశారంటూ ఎస్ఇ రమేష్ బాబు తెలిపారు.
అయితే అనవసరంగా కేసు నమోదు చేయడం పట్ల టీడీపీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి సంబంధం లేకుండా తోపులాట జరుగుతున్నసమయంలో యువనేత పరిటాల శ్రీరామ్ అక్కడ లేకపోయినా అనవ సరంగా కేసు నమోదు చేయడం ఇది ఎంతవరకు సమంజసమని అని టిడిపి శ్రేణులు ఆవేదన వ్యక్తం చేశారు.