మహిళా దినోత్సవం సందర్భంగా అమరావతి రైతులు, మహిళలు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అలా శాంతియుతంగా చేసిన ఆందోళనలపై పలు కేసులు నమోదు చేశారు పోలీసులు.
వాటి వివరాలు: Cr.no 64/2021 U/S 143, 188, 332 353, 506, 509, R/W 149 ఐపీసీ సెక్షన్ల కింద తుళ్లూరు పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు అయ్యాయి. మల్కాపురం జంక్షన్ వద్ద జరిగిన ఆందోళనకు సంబంధించి వై.మల్లీశ్వరి, జి. ప్రభావతి, కె.గోవిందమ్మ, బి. ప్రియాంక, కె. శిరీషా, పి. రాధిక, పి. సుధాకర్, జి.మార్టిన్, ఎ.మనోజ్, ఎ.రాజేష్, పి.రమేష్, రాయపాటి శైలజ, శివారెడ్డి, బి. సాంబశివరావు, డి. సుధాకర్, వై. భూషయ్య, కె.జగన్లపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
Cr.no 63/2021 U/S 143, 188, 353, 506, 509, R/W 149 ఐపీసీ సెక్షన్ల కింద తుళ్లూరు పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు అయ్యాయి. మందడం లైబ్రరీ సెంటర్లో వై.మల్లీశ్వరి, జి. ప్రభావతి, కె.గోవిందమ్మ, బి. ప్రియాంక, కె. శిరీషా, పి. రాధిక, రాయపాటి శైలజ, పి. సుధాకర్, ఎ. రాజేష్, బి.రమేష్, బి.సుధాకర్, వై. భూషయ్య, శివారెడ్డి, బి. సాంబశివరావులపై కేసులు నమోదు చేశారు.