గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం రాయపూడి లో ఒక కానిస్టేబుల్ అత్యుత్సాహం వల్ల ఓ వ్యక్తి మృతి చెందాడు. లాక్ డౌన్ నేపథ్యంలో గ్రామంలో రోడ్లపై తిరుగుతున్నారన్న సమాచారంతో ఆ ప్రాంతానికి పొలీసులు వెళ్లారు.
పోలీసుల్ని చూసిన గ్రామస్తులు పొలాల్లో కి పరుగు తీశారు. పొలాల్లో గ్రామస్తులను వెంట పడి తరుముకుంటూ వెళ్లారు. దాంతో షేక్ జాఫర్ (55) అనే వ్యక్తి ఎక్కువ దూరం పరుగెత్తి అలసిపోయి ఒక్క సారిగా కుప్పకూలిపోయాడు.
గత కొంత కాలంగా గుండె జబ్బుతో ఉన్న జాఫర్ పోలీసులు వస్తున్నారన్న భయంతో పొలాల్లోకి పరుగు తీస్తూ కిందపడి చనిపోయాడని గ్రామస్తులు తెలిపారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహం అమరావతి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తుళ్ళూరు సీఐ శరత్ బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.