అనంతపురం జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఆదేశాలతో పోలీసులు జిల్లా వ్యాప్తంగా వాహనాల తనిఖీలు చేపట్టారు. రోడ్డు భద్రతా నియమాల అమలు, రోడ్డు ప్రమాదాల నియంత్రణ, మద్యం, గంజాయి, నిషేధిత గుట్కా వంటి అక్రమ రవాణాను అరికట్టేందుకు గట్టి చర్యలు తీసుకున్నారు. దీంతో పాటు గ్రామసభలు నిర్వహించి సైబర్ నేరాలు, సి.సి కెమేరాల ఏర్పాటు, దిశ యాప్ , డయల్ – 100, తదితర అంశాలపై అవగాహన చేశారు. అదే విధంగా లాడ్జిలు తనిఖీలు చేపట్టారు. అపరిచితులకు అద్దె రూములు ఇచ్చేటప్పుడు ఆధార్ , తదితరాలను పక్కాగా చెక్ చేసుకోవాలని, అనుమానాస్పదులు అయితే వెంటనే తమ దృష్టికి తేవాలని సూచించారు.
సత్యం న్యూస్.అనంతపురం