అత్యంత ప్రతిష్టాత్మకంగా నేర రహిత సమాజ స్థాపనకు ఉపయోగపడేలా అంతే ఆధునీకరణతో బంజారా హిల్స్లో నిర్మిస్తున్న పోలీస్ కమాండ్ కంట్రోల్ భవనం నిర్మాణ పనులను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, రాష్ట్ర హోంమంత్రి మెహమూద్ అలీతో కలిసి పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, హైద్రాబాద్ సిటీ పోలీస్ కమీషనర్ అంజనీ కుమార్, సైబరాబాద్ పోలీస్ కమీషనర్ విసి సజ్జనార్ పోలీస్ అధికారులు ఉన్నారు.