28.2 C
Hyderabad
April 20, 2024 12: 52 PM
Slider వరంగల్

రచయితల సంఘాన్ని బెదిరించిన ఉప సర్పంచ్ భర్త

#mulugu police

జర్నలిస్టుల పేరు ఉపయోగించుకుని అక్రమ వసూళ్లకు పాల్పడవద్దని హితవు చెప్పిన వ్యక్తికి బెదిరింపులు ఎదురయ్యాయి. ములుగు ఉప సర్పంచ్ భర్త వంగ రవి విలేకరుల పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నాడని సమాచారం ఉంది.

ఇదే విషయాన్ని తెలంగాణ సామాజిక రచయితల సంఘం అధ్యక్షుడు సంద బాబు ఒక ప్రకటనలో చెప్పారు.

జర్నలిస్టుల పేరుతో డబ్బులు డిమాండ్ చేయడం కరెక్టు కాదని ఆయన చెప్పారు. తాను చేసిన ఆరోపణలు నిజం అయితే ఆ రిపోర్టర్ల పేర్లు చెప్పాలని కూడా ఆయన డిమాండ్ చేశారు.

తన విషయం మీడియాకు చెప్పినందుకు ఆగ్రహించిన వంగ రవి  తెలంగాణ సామాజిక రచయితల సంఘం అధ్యక్షుడు సంద బాబుకు ఫోన్ చేసి దుర్భాషలాడాడు.

తన విషయంలో జోక్యం చేసుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించాడు. దాంతో సందబాబు ములుగు ఎస్ కి ఫిర్యాదు చేశారు.

సంద బాబుతో బాటు ఫిర్యాదు చేసిన వారిలో సీనియర్ జర్నలిస్టులు కొట్టే రాజిరెడ్డి, సుంకరి సంపత్, గుర్రం శ్రీధర్, ముకులోత్ శరత్,  కుంచం రమేష్, జర్నలిస్టులు సంఘ రంజిత్ కుమార్, చల్లగురుగుల రాజు, ఆవుల వెంకన్న, విశ్వదేవర విశ్వనాధ్, ఓరుగంటి బిక్షపతి,   దొమ్మటి  వెంకటేష్, గట్టు ప్రశాంత్, దిగ్యపోగు మనోజ్ కుమార్,  జావీద్, పత్తి కోటేశ్వర్ ఉన్నారు.

Related posts

అభివృద్ధిని చూసి ఓర్వలేక అసత్య ప్రచారాలు

Satyam NEWS

ఇదేం న్యాయం: ఇళ్ల స్థలాల కోసం ఉన్న స్థలాలు ఖాళీ

Satyam NEWS

అమరుల త్యాగం ప్రజల గుండెల్లో పదిలం

Bhavani

Leave a Comment