28.2 C
Hyderabad
May 24, 2025 09: 29 AM
Slider మహబూబ్ నగర్

‘‘నాకు కరోనా వచ్చిందని పుకార్లు సృష్టిస్తున్నారు’’

#Kollapur Police

తనకు కరోనా వచ్చిందని రూమర్స్( పుకార్లు )సృష్టిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని గరీబ్ నవాజ్ హోటల్ ఖాజాపాష ఈరోజు కొల్లాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తనకు కరోనా వచ్చింది అని అనవసరంగా పుకార్లు పుట్టించి తన వ్యాపారాన్ని ఆర్థికంగా, తనని మానసికంగా దెబ్బతీయాలి అని  కొందరు పని కట్టుకుని వదంతులు సృష్టిస్తున్నారని ఆయన అన్నారు.

అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని కొల్లాపూర్ ఎస్ఐ మురలీధర్ గౌడ్ కు ఫిర్యాదు చేసారు. ఈ విషయంపై ఎస్ ఐ మాట్లాడుతూ కరోనా లేని వారికి కూడా కరోనా వచ్చింది అని పుకార్లు పుట్టిస్తున్న వారిని గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేసారు. దయచేసి ఎవరైనా ఎవరిపైనా ఇలాంటి లేనిపోనివి సృష్టించి వారి వ్యాపారాలను, మనోభావాలను దెబ్బతీసే పనులు చేయకండని ఈ సందర్భంగా ఎస్ ఐ కోరారు.

Related posts

ప్రజాస్వామ్య వ్యవస్థకు మోడీ తూట్లు

Murali Krishna

సంభవామి యుగే యుగే

Satyam NEWS

వనపర్తి నాలుగవ వార్డులో ఉచిత మెగా వైద్య శిబిరం

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!