శ్రీకాకుళం జిల్లా లావేరు మండల పోలీస్ స్టేషన్ లో విషాదం చోటు చేసుకున్నది. అక్కడ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న రొక్కం దినేష్ (38) విధులు ముగించుకుని ఇంటికు బయలుదేరుతుండగా అకస్మాత్ గా వచ్చిన గుండెపోటుతో మరణించాడు. ప్రమాదం గమనించి హుటా హుటాన శ్రీకాకుళం మెడికవర్ ఆసుపత్రికు తోటి సిబ్బంది తరలించారు. అయితే మార్గ మద్యంలోనే కానిస్టేబుల్ మృతి చెందినట్లు ఆసుపత్రి వైద్యులు నిర్ధారించారు. దాంతో కుటుంబీకులు తోటి సిబ్బంది శోక సముద్రంలో మునిగిపోయారు.