వనపర్తి సాక్షి టివి విలేకరి భాను ప్రకాష్ ను వనపర్తి టౌన్ ఎస్ఐ యుగంధర్ రెడ్డి సన్మానించారు. దారి తప్పిన బాలుడిని పోలీసుల సహకారంతో సాక్షి టివి విలేకరి భాను ప్రకాష్ తల్లి దండ్రుల చెంతకు చేర్చారు. ఇంటి నుండి దారి తప్పిన బాలుడు ప్రకాష్(7) ఎటు వెళ్లాలో అర్థం కాక గోపాల్ పేట నుండి వనపర్తి రోడ్డు వైపుగా నడుస్తూ రోడ్డు పైకి వస్తూ ఉండడం గుర్తించిన సాక్షి టీవీ విలేకరి భాను ప్రకాష్ బాబు దగ్గరికి వెళ్లి వివరాలు అడగగా ఇంటి నుండి తప్పిపోయాను అని తెలియజేయగా వెంటనే వనపర్తి టౌన్ పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చాడు. సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా బాలుడి ఆచూకీ కొరకు స్థానిక పోలీస్ స్టేషన్లో సంప్రదించగలరని పోస్ట్ చేయడంతో తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ కు వచ్చి బాలుడు ప్రకాష్ (7) తీసుకువెళ్లారు. బాధ్యతాయుత పౌరుడిగా దారి తప్పిన బాలుడిని తల్లిదండ్రుల వద్దకు చేర్చడంలో జర్నలిస్ట్ భాను ప్రకాష్ చూపిన చొరవను అభినందించి శాలువాతో టౌన్ ఎస్ఐ యుగంధర్ రెడ్డి సన్మానించారు. ఈ కార్యక్రమంలో వనపర్తి తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ హెచ్ – 143 జర్నలిస్ట్ యూనియన్ నాయకులు ఏబీఎన్ జానీ,ఆంధ్రప్రభ ఆనంద్,ఆంధ్రప్రభ సతీష్,వి6 మహబూబ్ పాషా,రాజ్ న్యూస్ సుంకరి రమేష్ యాదవ్,మెట్రో టివి గోవర్ధన్ శెట్టి పాల్గొన్నారు.
పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్.నెట్