ప్రమాదవశాత్తూ ఆటో కింద పడి తీవ్రంగా గాయపడ్డ వ్యక్తిని అంబులెన్సు వచ్చే వరకూ వెయిట్ చేయనివ్వకుండా పోలీసులు తమ వాహనంలోనే ఆసుపత్రికి తరలించారు. బిచ్కుంద మండల కేంద్రానికి చెందిన చౌహుస్ పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉన్న వాటర్ ప్లాంట్ లో పని చేసే చౌహుస్ ఆటోలో నీటి ట్యాంకులు సరఫరా చేసి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది.
కందర్ పల్లి, బిచ్కుంద రోడ్డుపైన ప్రమాదవశాత్తు ఆటో పై నుండి కింద పడడంతో అతనికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే గమనించిన నేషనల్ హైవే పెట్రోలింగ్ పోలీసులు సాయి బాబా తన సిబ్బందితో కలిసి గాయపడ్డ చౌహుస్ ను బిచ్కుంద ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలోని సిబ్బంది జ్ఞానేశ్వర్ గాయపడ్డ వ్యక్తికి చికిత్స నిర్వహించారు.