27.7 C
Hyderabad
March 29, 2024 03: 57 AM
Slider ఆంధ్రప్రదేశ్

అమరావతిలో యుద్ధ వాతావరణం సృష్టించిన పోలీసులు

police arrest

అమరావతి ప్రాంతంలో పోలీసు రాజ్యం నడుస్తున్నది. అక్కడ పోలీసుల దాష్టీకానికి అంతులేకుండా పోతున్నది. వారే నిషేధాజ్ఞలు విధించి వారే అరెస్టు చేసేస్తున్నారు. ఇళ్లలోకి చొరబడి మరీ పోలీసులు అరెస్టులు చేస్తున్నారు. ఆ ప్రాంతం అంతా యుద్ధ వాతావరణం తలపిస్తున్నది.

ఉద్దండరాయిని పాలెం లో పూజలు నిర్వహించి పొంగళ్లను నైవేద్యంగా విజయవాడ కనకదుర్గ అమ్మవారి గుడికి తీసుకెళ్లాలని ప్రయత్నం చేసిన మహిళా రైతులను పోలీసులు అడ్డుకున్నారు. 144 సెక్షన్,30 యాక్ట్ అమలులో ఉన్నoదున ఎవరూ బయటకు రావొద్దంటూ మైక్ లో పోలీసులు ప్రకటన చేశారు. గ్రామాల ప్రధాన కూడళ్ళలో మూళ్ళ కంచెలు ఏర్పాటు చేశారు.

చాలా మంది మహిళలను అరెస్టు చేశారు. మహిళలను సాయంత్రం 6 దాటినా అక్రమంగా అరెస్టు చేసి ఉంచారని పోలీసులను ప్రశ్నించడానికి వెళ్లిన ఎంపీ కేశినేని నాని ని, మాజీ ఎమ్మెల్యేలు దేవినేని ఉమా, బోడె ప్రసాద్, ఎమ్మెల్సీ అశోక్ బాబు లను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చూపించకుండా పోలీసు వాహనంలో తిప్పుతున్నారు. ఎటు తీసుకువెళుతున్నారో కూడా తెలియని వైనం వుంది.

నిన్న చంద్రబాబునాయుడిని కూడా ఇదే విధంగా చేశారు. నేడు తెలుగుదేశం పార్టీ నాయకులు నారా లోకేష్, కళా వెంకటరావులను పోలీసులు అడ్డగించారు.

Related posts

“స్పందన”కు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా….!

Satyam NEWS

జనం నోట అన్నమయ్య సంకీర్తనలు

Bhavani

నవయుగ రక్తదాన శిబిరానికి విశేష స్పందన

Satyam NEWS

Leave a Comment