30.7 C
Hyderabad
April 19, 2024 08: 58 AM
Slider అనంతపురం

రాయదుర్గంలో యువకుడికి పోలీసు చిత్రహింసలు

#Mallikarjuna

అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో మల్లికార్జున  అనే యువకుడిపై సి ఐ  తులసి రామ్ జులుం ప్రదర్శించారు. ఫేస్ బుక్ లో రాయదుర్గం పట్టణంలో అమలుచేస్తున్న లాక్ డౌన్ పై పోస్టులు పెట్టినందుకు యువకుడిని పోలీస్ స్టేషన్ కు తరలించి రాయదుర్గం అర్బన్ సిఐ తులసీరామ్, పోలీసులు మల్లికార్జున చితకబాదారు.

షుగర్ పేషంట్ అని చెప్పినా వినకుండా విచక్షణ రహితంగా చితకబాదరని బాధితుడు ఆందోళన వ్యక్తం చేశాడు. లాఠీలు విరిగిన ఆపకుండా రక్త గాయాలు అయ్యేంత వరకు  పోలీసులు విరుచుకుపడ్డారు అని ఆవేదన వ్యక్తం చేశాడు.

తాను ఎలాంటి తప్పు చేయకపోయినా అప్పటికీ కూరగాయలు కొనేందుకు బజారుకు వెళ్ళిన యువకుడిని పోలీసులు జీపులో ఎక్కించుకుని పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లి నానా చిత్రహింసలు పెట్టారని వాపోయాడు.

Related posts

ఎన్నో సంక్లిష్ట సమస్యలకు పరిష్కారం చూపే డేటా సైన్స్

Satyam NEWS

త్వరలో ఆన్‌లైన్ ద్వారా ఆనందయ్య మందు పంపిణీ

Satyam NEWS

షేక్ పేట గురుకుల పాఠశాలలో అగ్ని ప్రమాదం

Bhavani

Leave a Comment