ముఖ్యమంత్రి ని, మంత్రులను ఉద్దేశిస్తూ “చెత్త నా కొడుకులు” అన్న టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు పై తక్షణమే చర్యలు తీసుకోవాలని గుంటూరు జిల్లా నరసరావుపేట శాసన సభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు డిమాండ్ చేశారు.
కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా రైతు భరోసా వంటి సంక్షేమ పథకాలు నిరాటంకంగా ఇచ్చిన వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని వారు అన్నారు. రైతుకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం నిరంతరం కృషి చేస్తున్నామని వారు తెలిపారు.
58 లక్షల మంది రైతులు ఈ ప్రభుత్వం లో లాభపడ్డారని వారు తెలిపారు. ఉచిత విద్యుత్ కోసం 19,130 కోట్ల రూపాయలు తమ ప్రభుత్వం ఖర్చు చేసిందని వారు తెలిపారు. రైతులకోసం ఈ రెండేళ్ళలో 22 వేల కోట్లు ఖర్చు చేశామని ఎమ్మెల్యేలు తెలిపారు. విద్యుత్ శాఖ లో గత ప్రభుత్వం చేసిన అప్పులకు గాను తమ ప్రభుత్వం పై ట్రూ అప్ భారం పడిందని వారు తెలిపారు.
విద్యుత్ చార్జీలను ఎలాంటి పరిస్థితుల్లో కూడా పెంచమని వారు తెలిపారు. ఇప్పటికే ఉచిత పంటల భీమా కోసం కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసామని వారు తెలిపారు. అయ్యన్నపాత్రుడు కి పిచ్చి పట్టిందని, ఎర్రగడ్డ హాస్పిటల్ లో జాయిన్ చేయించాలని వారు డిమాండ్ చేశారు.