పోలీస్ శాఖ ప్రతిష్ట పెరిగేలా పెంచేలా విధినిర్వహణ ఉండాలని హోంగార్డ్స్ రేంజ్ డి ఎస్ పి లక్ష్మణ్ కుమార్ సూచించారు. అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా ఆయన బుధవారం జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఆదేశాలతో హోంగార్డులతో పరేడ్ నిర్వహించి అనంతరం పలు సూచనలు చేశారు.
హోంగార్డుల నుండీ గౌరవ వందనం స్వీకరించిన తర్వాత మాట్లాడారు. పోలీసు అధికారుల ఆదేశాలను తు.చ తప్పకుండా పాటించాలని సూచించారు. అంకిత భావంతో విధులు నిర్వర్తించాలని కోరారు. అదే సమయంలో కోవిడ్ నిబంధనలు పాటించి విధుల్లో ఎలాంటి ఇబ్బంది కల్గకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈకార్యక్రమంలో హోంగార్డ్స్ ఆర్ ఐ శివ రాముడు, ARSI ఏసయ్య, తదితరులు పాల్గొన్నారు.