మతవిశ్వాసాలను కించపరిచే విధంగా పోస్టులు పెడుతున్న వారిపై చర్య తీసుకోవాలని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఫారూఖ్ షిబ్లీ కోరారు. ఈ మేరకు ఆయన రాష్ట్ర డిజిపి గౌతమ్ సవాంగ్ కు వినతిపత్రం సమర్పించారు.
మత విశ్వాసాలను అత్యంత దారుణంగా కించపరుస్తూ పోస్టులు పెట్టిన వారి జాబితాను, 130 ఫేస్ బుక్ పోస్టులను లింకులను కూడా డిజిపికి ఇచ్చారు. ఇలాంటి పోస్టుల వల్ల మత హింస చెలరేగే అవకాశం ఉన్నందున తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
విదేశాల నుండి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిన తబ్లేగి జమాత్ ప్రతినిధులు కరోనా మహమ్మారి వ్యాప్తి చేస్తున్నారని కొందరు పోస్టులు పెట్టగా సుమారు 24 మందిపై గుంటూరు, సత్తెనపల్లి, నెల్లూరు ప్రాంతాల్లో పోలీసులు కేసులు నమోదు చేశారని ఆయన తెలిపారు.
ఆ కేసులను తొలగించి వారిని స్వదేశాలకు పంపాలని కోరారని, ముంబై, చెన్నై హైకోర్టులు తబ్లీగిల విషయంలో తీర్పు ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తెలుగు రాష్ట్రాల జమీయత్ ఏ ఉలేమా ఏ హింద్ అధ్యక్షుడు హఫీజ్ పీ ర్ షబ్బీర్ కూడా ఈ విషయంలో తన ఆందోళన వ్యక్తం చేశారని షిబ్లీ తెలిపారు.