మంథని కి చెందిన వామన్ రావు, నాగమణి దంపతులను హత్య చేయడం అమానుషం అని ములుగు ఎమ్మెల్యే దనసరి అనసూయ (సీతక్క) అన్నారు.
ఈరోజు ములుగు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయములో ఎమ్మెల్యే మాట్లాడుతూ హత్య కేసుతో ప్రమేయం ఉన్న అధికార టీఆర్ఎస్ పార్టీ కి చెందిన నాయకుల పై తగు చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.
ఈ కార్యక్రమం లో ములుగు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నల్లెల్ల కుమార స్వామి, ములుగు జిల్లా యూత్ అధ్యక్షులు బానొతు రవి చందర్, కూనురు అశోక్ గౌడ్,
ములుగు మండల మైనారిటీ సెల్ అధ్యక్షులు షకీల్ అహ్మద్, కిసాన్ సెల్ ములుగు మండల అధ్యక్షులు నల్లాని సత్య నారాయణ రావు,
పెద్దాపూర్ గ్రామ కమిటీ అధ్యక్షుడు ఎండీ. షుకుర్, గోవర్ధన్ రెడ్డి, యువజన నాయకులు మేడి శెట్టి కోటి తదితరులు పాల్గొన్నారు.
కె.మహేందర్, సత్యంన్యూస్