సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లోని ఏఆర్ సిబ్బంది తో ఈరోజు సైబరాబాద్ పోలీస్ కమీషనర్ ఎం స్టీఫెన్ రవీంద్ర సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ఏఆర్ సిబ్బంది వెన్నముకలా పని చేస్తూ సైబారాబాద్ పోలీస్ కమీషనరేట్ కు, తెలంగాణ పోలీస్ శాఖ కు మంచి పేరు తీసుకువస్తున్నారని, సిబ్బంది అందరూ సరైన క్రమశిక్షణతో, అంకితభావంతో పనిచేస్తూ, సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ కు, తెలంగాణ పోలీస్ కు మంచి పేరు తీసుకురావాలని మనస్పూర్తిగా కోరుతున్నానన్నారు. అదే విధంగా సిబ్బంది వ్యక్తిగత ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ప్రతి దినం వ్యాయామం, యోగా వంటి వి ప్రాక్టీస్ చేస్తూ ఫిట్నెస్ ను కాపాడుడుకుంటూ, వృత్తి నైపుణ్యాలను పెంచుకోవాలన్నారు.
అదేవిదంగా ఏఆర్ సిబ్బందికి కూడా కొన్ని సమస్యలు ఉన్నాయని గ్రీవెన్స్ సెల్ ద్వారా తెలిసాయని వాటిని పరిష్కరిస్తామని అన్నారు. అనంతరం సీపీ గారు సిఏఆర్ హెడ్ క్వార్టర్స్లోని అన్ని సెక్షన్ లను సందర్శించి సిబ్బంది తో ప్రత్యేకంగా మాట్లాడి వారికి ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ ఏడీసీపీ ఎండీ రియాజ్ ఉల్ హక్, ఏసీపీలు మట్టయ్య, కృష్ణ , ధనలక్ష్మి, ఇన్స్పెక్టర్లు, ఆర్ఐలు, హెడ్ క్వార్ట్స్ సిబ్బంది, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.