25.2 C
Hyderabad
January 21, 2025 10: 53 AM
Slider గుంటూరు

పోలీస్ నోటీస్:అవాంఛనీయ సంఘటనల్లో పాల్గొనవద్దు

andhra-pradesh-police

అమరావతి JAC తలపెట్టిన బంద్ సందర్భంగా అవాంఛనీయ ఘటనలలో పాల్గొనే వారి పైన చట్టబద్దమైన చర్యలు తీసుకుటామని గుంటూరు అర్బన్ ఎస్పీ పి.హెచ్.డి. రామకృష్ణ, గుంటూరు రూరల్ ఎస్పీ సిహెచ్. విజయరావు తెలిపారు. గుంటూరు అర్బన్, రూరల్ పరిధుల్లో విద్యార్ధులకు, ఉద్యోగులకు, సాధారణ ప్రజలకు పబ్లిక్, ప్రయివేటు రవాణాకు ఇబ్బంది కలిగే విధంగా ఎవ్వరూ అవాంఛనీయ కార్యక్రమాలు నిర్వహించరాదని కోరారు.

బలవంతంగా షాపులు, విద్యాసంస్థలు మూయించడం చేయవద్దని కోరారు. బంద్ సందర్భంగా సంఘ విద్రోహ శక్తులు నిరసన కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరారు. చట్టవిరుద్ధమైన కార్యకలాపాల లో పాల్గొన్న వారిపైన సంబంధిత చట్టాల మేరకు కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

Related posts

భద్రాచలం – పాల్వంచల మధ్య రాకపోకలు నిలిపివేత

Satyam NEWS

Solidarity: మరో పోలీసు అధికారికి కరోనా పాజిటీవ్

Satyam NEWS

ఉప్పల్ కాంగ్రెస్ నాయకులకు పదవీ బాధ్యతలు

Satyam NEWS

Leave a Comment