నూతన్ నాయుడును విశాఖ పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్న నూతన్ నాయుడును లోతుగా విచారించేందుకు అనుమతినివ్వాలంటూ పోలీసులు పిటిషన్ దాఖలు చేసారు. శని ఆదివారాల్లో విచారించేందుకు పోలీసులకు అనుమతిచ్చారు. ఇవాళ పోలీసులు నూతన్ నాయుడిని ఉదయం విశాఖ సెంట్రల్ జైలు నుంచి పెందుర్తి తీసుకువచ్చి విచారిస్తున్నారు. ఇదిలా ఉండగా తన ఇంట్లో పని చేసి మానేసిన ఓ యువకుడికి నూతన్ నాయుడు భార్య మధుప్రియ శిరోముండనం చేయించడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఇప్పటికే మధుప్రియ తో సహా ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేసారు. మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్ పేరుతో నూతన్ నాయుడు పలు అక్రమాలకు పాల్పడిన నేపథ్యంలో పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
previous post