ములుగు జిల్లా పసర SHO (Station House Officer )గా ఎస్ ఐ H.రవీందర్, తాడ్వాయి SHO గా సిహెచ్ వెంకటేశ్వరరావు నేడు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి. పాటిల్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు.
జిల్లా ఎస్పీ ఇరువురికి అభినందనలు తెలిపి మేడారం జాతర సమయం లో అద్భుతంగా పని చేశారని అదేవిధంగా రాబోయే రోజులలో కూడా స్ఫూర్తిదాయకంగా సమాజ శ్రేయస్సు కోసం పాటుపడుతూ అసాంఘిక శక్తులను అణచివేస్తూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ శాంతి భద్రతల పర్యవేక్షణ చేయాలన్నారు.