31.7 C
Hyderabad
April 19, 2024 02: 20 AM
Slider విజయనగరం

అభిన‌వ నార‌దుడు…..స‌మ‌న్వ‌యంతో ప‌ని చేస్తున్న పోలీస్ పీఆర్ఓ

#PolicePRO

నార‌దుడు అంటే చిచ్చు పెట్టేవాడ‌ని అర్ధం కాదు…స‌మాచారాన్నిచేరే వేసే వ్య‌క్తి అని. తొలి ప్ర‌జా సంబంధాల అధికారి అంటే పీఆర్ ఓ.ఎవ్వ‌రంటే నార‌దుడు. ఆ సంగ‌తి ఇప్పుడెందుకంటూరా…? అక్క‌డ‌కే వ‌స్తున్నా.

ప్ర‌స్తుత ఈ స్మార్ట్ యుగంలో అంద‌రికీ వేగం కావాలే త‌ప్ప‌…స్ప‌ష్ట‌త,నిజానిజాలు క‌నుక్కోవ‌డంతో ఏ ఒక్క‌రికీ ప‌ని లేదు. సోష‌ల్ మీడియా రావ‌డంతో  సెక‌న్ల‌లో స‌మాచారం యావ‌త్  ప్ర‌పంచానికే తెలిసిపోతోంది.

అందులో వాస్త‌వాలు..నిజానిజాలు…న‌గ్న స‌త్యాల‌తో ఎవ్వ‌రికీ ప‌ని లేదు. ఇలాంటి త‌రుణంలో ప్ర‌తీ సంస్థ‌…ఓ పీఆర్ ఓ ను పెట్టుకుంటోంది…పెట్టుకుంది కూడ‌. ఈ అధునాత‌న ,శాస్త్ర సాంకేతిక విషయాలు శ‌ర‌వేగంగా దూసుకెళుతున్న త‌రుణంలో పీఆర్ఓ వ్యవ‌స్థ అత్యంత ఆవ‌శ్య‌క‌మ‌ని వేరేగా చెప్ప‌న‌క్క‌ర‌లేదు.

ఈ  ప‌ద‌విని ఈ వ్య‌వ‌స్థ‌ను గ‌త పుష్క‌ర కాలం  నుంచీ చ‌క్క‌గా న‌డుపుతోంది ఏపీలోని విజ‌య‌న‌గ‌రం జిల్లా  పోలీస్ శాఖ. ఆ విభాగానికి  ప్ర‌జా సంబంధాల అధికారిగా వ్య‌వ‌హ‌రిస్తున్న కోటేశ్వ‌ర‌రావు స‌మ‌ర్ధ‌వంతంగా,స్ప‌ష్టంగా, నిజాయితీగా అటు పోలీసు ఉన్నతాధికారుల‌కు ఇటు, మీడియకు స‌మాచారాన్ని చేర‌వేస్తూ స‌మ‌ర్ద‌వంత‌మైన పీఆర్ఓ గా మ‌న్న‌న‌ల‌ను పొందుతున్నారు.

గ‌తంలో  విజ‌య‌న‌గ‌రం రూరల్ పోలీస్ స్టేష‌న్ లో  కానిస్టేబుల్ గా ప‌ని చేనిన కోటేశ్వ‌ర‌రావు శాఖా ప‌రంగా అంద‌రితో మంచిగా  ఉంటూ సంబంధాలు పెంచుకునే వారు. ప‌దేళ్ల క్రిత‌మే అంటే అప్ప‌టి జిల్లా ఎస్పీ సౌమ్య మిశ్రా కానిస్టేబుల్ కోటేశ్వ‌ర‌రావు ప‌నిత‌నాన్ని గుర్తించారు కూడ‌.

అప్పుడే ర‌వి అనే బ‌య‌టి వ్య‌క్తి పీఆర్ ఓ గా ప‌ని చేసేవారు. అయితే అప్ప‌ట్లో ఆ వ్య‌క్తి స‌మ‌ర్ధ వంతంగా ప‌ని చేయ‌క పోవ‌డంతో అనూహ్య ప‌రిణామాల నేప‌ద్యంలో కానిస్టేబుల్ కోటేశ్వ‌ర‌రావును పీఆర్ఓ ప‌ద‌వి వ‌రించింది.

అప్ప‌టి నుంచీ జిల్లాకు వ‌చ్చిన ఎస్పీల వ‌ద్ద మ‌న్న‌న‌ల‌ను పొందుతూ అంచ‌లంచెలుగా ఎదిగిన హెచ్.సి స్థాయికి చేరుకున్న కోటేశ్వ‌ర‌రావు జ‌ర్న‌లిజంలో మాస్ట‌ర్ డిగ్రీ కూడా పూర్తి  చేసే ప‌నిలో ప‌డ్డారు.

ఇక అనుభ‌వం దృష్ట్యా కోటేశ్వ‌ర‌రావును ఎస్ఐ ప‌ద‌వి అలంక‌రించ‌డ‌మే త‌రువాయి. ఇక ప్ర‌స్తుతం క‌రోనా సెకండ్ వేవ్ ప‌రిస్థితుల‌లో….ఇద్ద‌రు స‌హాయ‌కులైన రాము,శ్రీనివాస్ , కిషోర్ లతో సంయుక్తంగా పోలీస్ పీఆర్ విభాగాన్ని స‌మ‌ర్ద‌వంతంగా నిర్వ‌హిస్తున్నారు.

ఏదైన‌ప్ప‌టికీ  ఎస్పీ సౌమ్య మిశ్రా నుంచీ  ప్ర‌స్తుత ఎస్పీ రాజ‌కుమారీ వ‌ర‌కు దాదాపు 12 మంది ఎస్పీల వ‌ద్ద పీఆర్ఓగా ప‌ని చేసిన చేస్తున్న ఘ‌న‌త కోటేశ్వ‌ర‌రావుదేన‌ని చెప్పొచ్చు.

సో జిల్లాకు వ‌చ్చిన ఎస్పీల  ఆదేశాలు,సూచ‌న‌లతో పీఆర్ఓ కోటేశ్వ‌ర‌రావు అటు శాఖ‌కు, ఇటు మీడియాకు త‌గ్గ‌ట్టుగానే ప‌ని చేస్తున్నార‌ని చెప్పాలి.హేట్సాప్ పీఆర్ఓ.‌‌

Related posts

రైతు బంధు వద్దన్న కాంగ్రెస్ వాళ్లకు ఓట్లు బంద్ చేయాలి

Satyam NEWS

న్యూయార్క్‌లో భారీ అగ్ని ప్రమాదం

Sub Editor

ఏపి బీజేపీ నుంచి మరో వికెట్ అవుట్: సోమూ ఏ క్యాహై?

Satyam NEWS

Leave a Comment