సంక్రాంతి ,కనుమ దృష్ట్యా ఎవ్వరైనా కోడి పందాలు, పేకాట లు ఆడితే.. కఠిన మైన చర్యలు తప్ప ని విజయనగరం జిల్లా పోలీసు బాస్ హెచ్చరించిన దరిమిలా అలానే శాఖా సిబ్బంది దాడులు చేసారు. ఈ మేరకు జిల్లాలో పలు పోలీసు స్టేషన్ పరిధులలో పక్కగా వచ్చిన సమాచారం మేరకు పేకాట స్థావరాలపైన ,కోడి పందాలపైన పోలీసులు దాడులు చేసి…భారీ సొమ్ము స్వాధీనం చేసుకున్నారు.
జిల్లాలోని గంట్యాడ పీఎస్ పరిధిలో కోడి పందాల పై పోలీసులు రైడ్ చేసి, ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి 5,030/- ల నగదు, రెండు కోడి పుంజులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.విజయనగరం టూటౌన్ పీఎస్ పరిధి దాసన్నపేటలో పేకాట ఆడుతున్న వారిపై పోలీసులు రైడ్ చేసి, 7 గురిని అరెస్టు చేసి, వారి వద్ద నుండి 9,730/- ల నగదు స్వాధీనం చేసుకున్నారు.
ఇక జిల్లా లోని కొమరాడ మండలం శివిని గ్రామం వద్ద అంతర్ రాష్ట్ర రహదారిపై గుంతలు ఏర్పడి, వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడగా కొమరాడ పోలీసులు ఏర్పడిన గుంతలను పూడ్చి, తాత్కాలిక రిపేర్లు చేపట్టి, వాహనాల రాకపోకలు సుగమనం చేశారు.
అదే విధంగా జిల్లాలోని గజపతినగరం మండలం పాత బగ్గాం గ్రామ శివార్లలో కూడా కోడి పందాలు ఆడుతున్న వారిపై పోలీసులు రైడ్ చేసి, నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి, వారి వద్ద నుండి 4 కోడి పుంజులను స్వాధీనం చేసుకున్నారు.ఏదైనా ఆరునెలల క్రితం జిల్లా కు వచ్చిన లేడీ పోలీసు బాస్ దీపికా… తన పనితనం ఏంటో చేతలలో చేసి చూపిస్తున్నారని అంటోంది సత్యం న్యూస్. నెట్.
ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్, విజయనగరం