ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత కర్ఫ్యూ సడలింపు సమయాన్ని ప్రభుత్వం పొడిగించింది. మధ్యాహ్నం 12 వరకు ఉన్న సమయాన్ని మరో రెండు గంటలు పొడిగింపు ఉదయం 6 నుంచీ మధ్యాహ్నం 2 వరకూ సడలించింది.
ఈ నేపధ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు నిబంధనలు పట్ల కాస్త మెతకవైఖిరిని అవలంబిస్తున్నారు. ఈ క్రమంలో నే విజయనగరం జిల్లా లో పోలీసులు.. ఆ రకంగా నే సడలింపు నిబంధనల ను అమలు చేస్తున్నారు.
తాజాగా జిల్లా లోని మూడు డివిజన్ పరిధులలో డీఎస్పీల ఆధ్వర్యంలో సిబ్బంది కర్ఫ్యూ నిబంధనల సడలింపు పొడిగించిన అనంతరం సిబ్బందికి తగు రీతిలో సూచనలిస్తూ విధులు నిర్వర్తించసాగారు.
ఈ మేరకు జిల్లా కేంద్రంలో అటు ట్రాఫిక్ డీఎస్పీ, ఇటు లా అండ్ ఆర్డర్ డీఎస్పీ లు..తమ, తమ సిబ్బందికి తగు సూచనలిస్తున్నారు. మరోవైపు ఎస్పీ సైతం కర్ఫ్యూ వేళల సడలింపు సందర్భంగా 2 గంటల తర్వాత ఏ ఒక్కరైనా రోడ్ మీద కనిపిస్తే జరీమాన విధించాలని సిబ్బందికి ఆదేశించారు.
ఇందులో భాగంగా ఎస్పీ…నగరంలో మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఆర్టీసీ కాంప్లెక్స్, బాలాజీ జంక్షన్ ల వద్ద సిబ్బంది నిర్వహిస్తున్న విధులను పరిశీలించారు. ఈ క్రమంలో నే ఎంఆర్ కాలేజీ వద్ద ట్రాఫిక్ డీఎస్పీ మోహన్ రావు..తన సిబ్బంది చే 2 గంటల తర్వాత రోడ్ మీదకు వచ్చిన వారికి 500 రూపాయలు జరీమాన విధించారు.
ఏది ఏమైనా ఓ వైపు కేసులు తగ్గడం అదే సమయంలో కర్ఫ్యూ సడలింపు వేళలను పొడిగించడం..తద్వారా పోలీసు నిర్వర్తించాల్సిన విధులు కాస్త తగ్గాయంటోంది సత్యం న్యూస్. నెట్.