విజయనగరం పోలీసు ట్రైనింగ్ కళాశాలలో ఓ ట్రైనీ ఎస్ఐ తనకు కేటాయించిన క్వార్టర్స్ లోనే ఉరేసుకున్నారు. తెల్లారేసరికి తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి వెళ్లాల్సి ఉండగా ముందు రోజు ఈ దారుణానికి అదీ పోలీసు క్వార్టర్స్ లో ఫేన్ కు ఉరేసుకుని కనిపించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి వెళ్లి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ మేరకు డీఐజీ ఆదేశాలతో విజయనగర డీఎస్పీ అనిల్ మాట్లాడుతూ.. వ్యక్తి గత కారణాల వల్ల అనుకుంటున్నామని…అయినా కేసు నమోదు చేసామని విచారణ లో తేలుతుందన్నారు.