ప్రజాచైతన్య యాత్ర నిమిత్తం విశాఖ వచ్చిన టీడీపీ జాతీయ అధ్యక్ష్యులు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరిగి ప్రయణమయ్యేలా చేసింది పోలీసులేనని విశాఖ జిల్లా టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు పుచ్చా విజయ్ కుమార్ ఆరోపించారు.
విశాఖలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికారపార్టీకి తొత్తుల్లా మారిన పోలీసులు నిరంకుశత్వ విధానాలకు ఈ ఘటనే ఉదాహరణ అన్నారు. అమ్మపాలు తాగి రొమ్ము గుద్దె వంకర బుద్ధులు కలిగిన వైసీపీ నేతలకు అడుగులకు మడుగులు ఎత్తుతున్న పోలీస్ శాఖ టీడీపీ నేతలు అడిగే ప్రశ్నలకు జవాబు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
భూకబ్జాదారులైన రాబందులు నాయకుల రూపంలో రాజ్యమేలుతున్నారని ఆరోపించారు. అమాయకులైన నగరవాసులపై తప్పును నెడుతున్నారని ధ్వజమెత్తారు. రౌడీ మూఖలతో తమ నాయకుని వాహనాన్ని అడ్డగించి ప్రజాస్వామ్యాన్ని మంటగల్పిన ఘనత జగన్ సర్కార్ కే దక్కుతుందని దుయ్యబట్టారు.
2వ తేదీన కోర్టు తీర్పు అనంతరం తమ అధినేత చంద్రబాబు ని తప్పకుండా ఉత్తరాంధ్ర తీసుకొచ్చి ప్రతి గడపకు చైతన్య యాత్ర ను నిర్వహింప చేస్తామని స్పష్టం చేశారు.