రాజధాని రైతుల నిరసనలను బలవంతంగా అణచివేయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. నేటి ఉదయం రాజధాని తరలింపుపై తమ నిరసన తెలియ చేసేందుకు తుళ్లూరు లో రోడ్ పై టెంట్ వేస్తుంటే పోలీసులు అడ్డుకున్నారు. నిరసన తెలియచేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
దాంతో తుళ్లూరులో పోలీసులకి రైతులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్నది. పోలీసులు రైతుల ఉద్యమాన్ని అణచివేసేందుకు భారీగా మోహరించారు. దాంతో రైతులు కూడా తమ ఆందోళన తీవ్రతరం చేయడంతో చివరకు పోలీసులు వెనక్కి తగ్గాల్సి వచ్చింది. రోడ్డుపైన టెంట్ వేసిన రైతులు అందులో నిరసర దీక్ష ప్రారంభించారు.