విశాఖ రేంజ్ లో ఉన్న మూడు జిల్లాల్లో ఉన్న పోలీసు సిబ్బంది నుండి 11 వినతులను స్వీకరించారు.. రేంజ్ డీఐజీ రంగారావు. తక్షణమే పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రేంజ్ పోలీసు కార్యాలయంలో ఈరోజు పోలీసు సంక్షేమ దివస్ (పోలీస్ వెల్ఫేర్ డే) కార్యక్రమాన్ని డీఐజీ నిర్వహించారు.
విశాఖపట్నం జిల్లా, విజయనగరం మరియు శ్రీకాకుళం జిల్లాల్లో పనిచేస్తున్న సివిల్ , ఏ.ఆర్., మినిస్టీరియల్ విభాగాల అధికారులు, సిబ్బంది నుండి వచ్చిన ప్రతీ సమస్యను రేంజ్ డీఐజీ సమగ్రంగా విని పరిష్కారం చూపారు. నేరుగా ఇద్దరు ఇన్స్పెక్టర్లు ఎర్రన్నాయుడు, శేషు, మెరైన్ ఎస్సై తిరుపతి రావు స్వయంగా వచ్చి డీఐజీకి తమ సమస్యలు తెలియజేశారు. మిగిలిన వారు ఫోన్ ద్వారా వారి యొక్క వినతులు తెలిపారు.
సిబ్బంది నుండీ మొత్తం 11 వినతులు స్వీకరించారు. వెంటనే పరిష్కారం చూపాలని డీఐజీ ఆ విభాగాల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా బదిలీల గురించి, గ్రేడ్ ఇంక్రిమెంట్ , హోంగార్డు ఉద్యోగం గురించి, సీనియార్టీలో తేడా గురించి తదితర సమస్యలపై వినతులు తెలిపారు.