31.2 C
Hyderabad
April 19, 2024 06: 02 AM
Slider అనంతపురం

రాప్తాడులో పెరిగిపోతున్న రాజకీయ వేడి

#paritalasriram

శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడులో రాజకీయ వేడి రోజు రోజుకూ పెరిగిపోతున్నది. చాలా కాలంగా పరిటాల కుటుంబానికి తోపుదుర్తి కుటుంబానికి మధ్య రాజకీయ వైరుద్ధ్యం ఉంది. గత మూడు ఎన్నికల్లో తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి కుటుంబంపై పరిటాల ఫ్యామిలీ పైచెయ్యి సాధించగా 2019లో మాత్రం సీన్‌ రివర్స్‌ అయింది. అప్పటి నుంచి ఒకరిపై మరికరు దుమ్మెత్తి పోసుకుంటూనే ఉన్నారు.

ఎన్నికలకు ముందు ఇంటిని అమ్ముకునే స్థాయి నుంచి ప్రస్తుతం కోట్ల రూపాయాలు ఎలా వచ్చాయో ప్రజలకు తెలుసని, దొంగ ఓట్లతో ఎన్నికల్లో గెలిచారని తాజాగా పరిటాల శ్రీరామ్ ఆరోపించడంతో మళ్లీ రాజకీయ వేడి పెరిగిపోయింది. పరిటాల శ్రీరామ్‌ పదునైన విమర్శలే కాకుండాతనదైన శైలిలో వార్నింగ్‌ కూడా ఇచ్చారు. రాప్తాడులో మూడేళ్లుగా రెండు వర్గాల మధ్య ఈ తరహా మాటల యుద్ధం కనిపిస్తున్నా.. ఇప్పుడు మాత్రం మరింత పదును తేలుతున్నాయి.    

Related posts

టీడీపీ జనసేన కూటమికి 128 స్థానాలు

Satyam NEWS

బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ దేశానికి ముప్పులా తయారయ్యాయి

Bhavani

తెలంగాణ జాతీయసమైక్యతా దినంగా సెప్టెంబర్ 17

Bhavani

Leave a Comment