36.2 C
Hyderabad
April 25, 2024 19: 24 PM
Slider తూర్పుగోదావరి

ప్రశాంతమైన తూర్పుగోదావరి జిల్లాలో భగ్గుమన్న ఫ్యాక్షన్

#BikkavoluVinayakaTemple

తూర్పు గోదావరిజిల్లాలోని అనపర్తి, బిక్కవోలు మండలాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. అనపర్తి ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మధ్య మరోసారి రాజకీయ విభేదాలు భగ్గుమన్నాయి. దీంతో ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు ఇరు మండలాల్లో 144 సెక్షన్  అమలుచేస్తున్నారు.

రామకృష్ణా రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న హయాంలో జరిగిన  అవినీతి చిట్టాను బయట పెడతానని ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి ప్రకటించడంతో ఉద్రిక్తత ప్రారంభమైంది. ఆయన అవినీతిని రుజువు చేసేందుకు తనతో పాటు సాక్షులుతో  సత్యప్రమాణాలు చేయించనున్నట్లు పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో  నేడు బిక్కవోలు వినాయక గుడి లో మధ్యాహ్నం 2.30గంటలకు ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి తన భార్య తో కలసి సత్యప్రమాణం చేయనున్నారు.

ఇదే సమయంలో రామకృష్ణారెడ్డి కూడా సతీ సమేతంగా అదే గుడిలో సత్యప్రమాణానికి సిద్ధమయ్యారు. దీంతో అక్కడ ఏం జరగనుందనే దానిపై రాజకీయ వర్గాల్లో హైటెన్షన్‌ నెలకొంది. కాగా ఇరు వర్గాలకు ఆంక్షలతో కూడిన అనుమతి ఇచ్చినట్లు పోలీసులు వెల్లడించారు.

Related posts

బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ యాస్మిన్ భాష

Satyam NEWS

గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం పంపిణీ

Satyam NEWS

వేల సంవత్సరాల చరిత్రగలది మన యోగా

Satyam NEWS

Leave a Comment