27.7 C
Hyderabad
March 29, 2024 03: 47 AM
Slider ప్రత్యేకం

దేశానికి అన్నం పెట్టే రైతన్న పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రాజకీయాలు

#kollapurcongress

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మెడలు వంచైనా  రైతులు పండించిన  వరిని కొనుగోలు చేయిస్తామని నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి చింతలపల్లి జగదీశ్వర్ రావు అన్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం కొల్లాపూర్ పట్టణం, నియోజకవర్గంలో ప్రజా చైతన్య యాత్ర నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులతో వరి కొనుగోలు చేయాలని నినాదాలు చేస్తూ నియోజక వర్గంలో మండలాల   తాహాసిల్దార్  కార్యాలయంలో వరి కొనుగోలు చేయాలనీ డిమాండ్ చేస్తూ తాహాసిల్దార్ లకు   వినతి పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా  చింతల పల్లి జగదీశ్వర్ రావు మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులు పండించిన పంటను కొనుగోలు చేయకుండా రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతన్న పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ నాటకాలు ఆడుతున్నాయన్నారు.  రైతులతో రాజకీయ నాటకాలు ఆడుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచైన కాంగ్రెస్ పార్టీ  వరి కొనుగోలు చేయిస్తుంది అన్నారు.

వరి కొనుగోలు చేసే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో  టీ పిసిసి ఆర్గనైజింగ్ సెక్రటరీ రంగినేని జగదీశ్వర్, బ్లాక్ కాంగ్రెస్  అధ్యక్షులు రామ యాదవ్, కొల్లాపూర్ మండల అధ్యక్షుడు పరశురామ్ నాయుడు, పట్టణ అధ్యక్షులు కాంతారావు, సేవాదల్ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ ఖాదర్ పాషా, జిల్లా జనరల్ సెక్రెటరీ రఫిద్ధిన్, సీనియర్ నాయకులు, సిఆర్ ముఖ్య అనుచరులు శివానందం, కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు

Related posts

అదానీ షేర్ల పతనంపై నిపుణుల కమిటీ

Satyam NEWS

Analysis: కుల రాజకీయాల బీహారం ఎవరికో

Satyam NEWS

అఖిల పక్ష సమావేశం జరపకుండా స్టే ఇవ్వండి

Satyam NEWS

Leave a Comment