ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఉదయం పదిగంటలకు దాదాపు 20 శాతం పోలింగ్ నమోదైంది.
ఈ మున్సిపల్ ఎన్నికలు. నిఘానేత్రం నడుమ సాగుతోంది. జిల్లా కేంద్రంలో ప్రతీ పోలింగ్ కేంద్రం వద్ద అలాగే సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు పెట్టి మరీ పోలింగ్ నమోదు ను పర్యవేక్షిస్తున్నారు… ఎన్నికల అధికారులు.
ఈ మేరకు విజయనగరం ఎమ్మెల్యే వీరభద్ర స్వామి వేసిన పోలింగ్ కేంద్రంలో… మూడు చోట్ల సీసీ కెమారాలు అమర్చారు. పోలింగ్ బూత్ లోకి వెళ్లే ప్రతీ ఓటరు సీసీ కెమారాలో బందీ అవుతాడు.
అలాగే వేలిముద్ర వేయించుకునే వద్ద నుంచీ సీసీ కెమారాలలో నిక్షిప్తమవుతోంది.ఏది ఏమైనా ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల… నిఘా నేత్రం సాక్షిగా జరుగుతోంది.